Telangana: తెలంగాణలో మరో 239 మందికి కరోనా పాజిటివ్

Telangana corona media bulletin
  • గత 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,778 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 336 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,778 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,911కి పెరిగింది.  
Telangana
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News