Chandrababu: టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి డూండీ రాకేశ్ ను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

  • ఇటీవల చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తతలు
  • వైసీపీ శ్రేణుల ఆందోళన.. ఎదుర్కొన్న టీడీపీ
  • గాయపడిన డూండీ రాకేశ్ 
  • ఆసుపత్రిలో చికిత్స
Chandrababu talks to Dundi Rakesh

ఇటీవల చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా, టీడీపీ శ్రేణులు వారిని నిలువరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి డూండీ రాకేశ్ గాయపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాకేశ్ ను నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు. అతనికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాకేశ్ కు హామీ ఇచ్చారు. చంద్రబాబు నివాసం వద్ద జరిగిన రాళ్ల దాడిలో డూండీ రాకేశ్ కు కూడా బలమైన దెబ్బలు తగిలాయి. ఈ దాడిలో మంగళగిరి టీడీపీ నేత జంగాల సాంబశివరావు, ఓ టీవీ చానల్ కెమెరామన్ కూడా గాయపడ్డారు.

More Telugu News