Bandi Sanjay: మంత్రి కేటీఆర్ సవాల్ కు స్పందించిన బండి సంజయ్

  • కేటీఆర్ ఓ అజ్ఞాని అంటూ వ్యాఖ్యలు
  • తుపాకీ రాముడు అని ఎద్దేవా
  • కేటీఆర్ కు రాజ్యాంగం తెలియదని విమర్శలు
  • అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ఆగ్రహం
Bandi Sanjay responds to KTR challenge

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని, ఎవరిది తప్పయితే వారు రాజీనామా చేయాలని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ కాదు... కేసీఆర్ సవాల్ విసిరితే అప్పుడు చూస్తానని అన్నారు. కేటీఆర్ ఓ అజ్ఞాని అని, తుపాకీ రాముడు అని ఎద్దేవా చేశారు. యూపీఏ కంటే ఎన్డీయేనే రాష్ట్రానికి 9 శాతం అధికంగా నిధులు ఇచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందని వెల్లడించారు. కేటీఆర్ కు రాజ్యాంగం తెలియదని విమర్శించారు. ఒక్కో తెలంగాణ వ్యక్తిపై లక్ష రూపాయల అప్పు చేసినందుకు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు కేటీఆరే రాజీనామా చేయాలని అన్నారు.

More Telugu News