COVID19: తెలంగాణలో మరింత తగ్గిన కొవిడ్ వ్యాప్తి

  • గత 24 గంటల్లో 50,636 కరోనా పరీక్షలు
  • 230 మందికి కరోనా పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,545 మందికి చికిత్స
Covid details of Telangana

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,636 కరోనా పరీక్షలు నిర్వహించగా, 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,543 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,50,114 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,545 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది.

More Telugu News