siddarth: బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా శ‌వ‌ప‌రీక్ష పూర్తి.. గాయాలు లేవ‌ని చెప్పిన వైద్యులు

  • నిన్న గుండెపోటుతో సిద్ధార్థ్ మృతి
  • ముగ్గురు వైద్యుల ఆధ్వ‌ర్యంలో పోస్ట్ మార్ట‌మ్
  • అంత‌ర్గ‌త అవ‌యవాల‌ను విశ్లేషించాల్సి ఉంద‌న్న వైద్యులు
  • నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు 
postmortem for siddarth dead body

బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా(40) నిన్న గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ మృతదేహానికి ఈ రోజు ఉద‌యం ముగ్గురు వైద్యుల ఆధ్వ‌ర్యంలో పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించారు. సిద్ధార్థ్ శ‌రీరంపై ఎలాంటి గాయాలు లేవ‌ని శ‌వ‌ప‌రీక్ష‌లో తేలింది. అయితే, సిద్ధార్థ్ అంత‌ర్గ‌త అవ‌యవాల‌ను విశ్లేషించాల్సి ఉంద‌ని, ఆయ‌న‌ మృతికి కార‌ణ‌మేంట‌న్న విష‌యంపై ఆ త‌ర్వాత స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని వైద్యులు అంటున్నారు.

వాటి న‌మూనాల‌ను విశ్లేష‌ణ కోసం పంపించిన‌ట్లు వివ‌రించారు. హిస్టోపాథాల‌జీ జ‌రిపిన త‌ర్వాత వివ‌రాలు తెలుస్తాయ‌ని అన్నారు. కాగా, బుల్లితెర నటుడిగా, బిగ్ బాస్ 13లో విజేత‌గానూ ప్రేక్ష‌కుల‌కు సిద్ధార్థ్  సుప‌రిచితుడు. కెరీర్‌లో మంచి అవ‌కాశాలు వ‌స్తోన్న స‌మ‌యంలో ఆయ‌న మృతి చెందారు.

More Telugu News