Mahesh Babu: 'సర్కారువారి పాట' షూటింగులో సముద్రఖని!

  • మళ్లీ మొదలైన 'సర్కారువారి పాట'
  • హైదరాబాద్ లో తాజా షెడ్యూల్
  • ప్రతినాయకుడిగా సముద్రఖని
  • జనవరి 13వ తేదీన విడుదల
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, ఆ తరువాత 'గోవా' షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. నిన్నటి నుంచే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలైంది. నిన్నటి నుంచే ఈ సినిమా షూటింగులో సముద్రఖని పాల్గొంటున్నారు. ఆయన కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ షూటింగు మరికొన్ని రోజుల పాటు సాగనుంది.

'అల వైకుంఠపురములో' '.. 'క్రాక్' సినిమాలతో విలన్ గా మంచి మార్కులను కొట్టేసిన సముద్రఖని, ఈ సినిమాలోను ప్రతినాయకుడిగానే నటిస్తున్నాడు. ఆయన విలనిజం చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News