USA: అమెరికాలోని భారతీయ రెస్టారెంట్​ లో స్పైసీ మటన్​ కూరతో భోజనం చేశాక.. తానూ భారతీయుడినయ్యానన్న నైజీరియన్.. ఇదిగో వీడియో

  • తొలిసారి భారతీయ వంటకం తిన్న లాంబోగిని
  • గోవా ఫుడ్ ల్యాంబ్ విడాలూను సర్వ్ చేసిన రెస్టారెంట్
  • ఫుడ్ కు డబుల్ చెల్లిస్తానంటూ కామెంట్లు
Nigerian Man First Time Tastes Indian Food and His Reaction is Price less

టచారా రే, లాంబోగినీ అనే నైజీరియన్ దంపతులు అమెరికాలోని బొనానీ టేక్ అవుట్ ఇండియన్ కిచెన్ అనే భారత రెస్టారెంట్ కు వెళ్లారు. లాంబోగినీ ఓ థాలీని ఆర్డర్ చేశాడు. దీంతో అన్నంతో పాటు పరాటాలు, ల్యాంబ్ విండాలూ (గోవాలో ఓ రకం మటన్ కూర) కూరను ఆ రెస్టారెంట్ వెయిటర్ తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు. ‘ఇది తియ్యగా లేకుంటే బిల్లు కట్టను’ అంటూ లాంబోగినీ అన్నాడు.

‘అది తియ్యగా ఉండదు.. కారం కారంగా ఉంటుంది’ అని ఆ వెయిటర్ బదులిచ్చాడు. తర్వాత ఆ డిషెస్ ఓపెన్ చేసుకుని, అన్నంలో కూర కలిపి తిన్న లాంబోగినీ.. ఆ టేస్ట్ కు ఫిదా అయిపోయాడు. తొలిసారి అన్నం తిన్న అతడు అది సూపర్ అంటూ పొగిడేశాడు. ఆర్డర్ పెట్టిన థాలీని చకచకా లాగించేసి.. డబ్బులు డబుల్ కట్టేస్తా అన్నాడు. దాంతో పాటు మరిన్ని భారతీయ వంటకాలను పార్శిల్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

ఈ అన్నం తిని తాను కూడా ‘భారతీయుడిని అయిపోయాను’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ వీడియోను ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో నెటిజన్లూ ఫిదా అయిపోతున్నారు. కాగా, పోర్చుగీసు వంటకమైన ‘డి విన్హ డల్హోస్’ ఆధారంగా ల్యాంబ్/మటన్ విండాలూను వండుతారు.

More Telugu News