Atchannaidu: వైసీపీ నేత‌ల‌కు స‌వాలు విసిరిన‌ అచ్చెన్నాయుడు

  • ఉత్తరాంధ్ర ప్రాంతానికి టీడీపీ ఏం చేసిందో  చెబుతాం
  • వైసీపీ ఏం చేసిందో చెప్పండి
  • అభివృద్ధి చేయలేకే మూడు రాజధానుల అంశం తెర‌పైకి
atchennaidu challenges ycp

ఉత్తరాంధ్ర ప్రాంతానికి గత టీడీపీ ప్ర‌భుత్వం ఏం చేసిందో తాము చెబుతామని, మ‌రి వైసీపీ స‌ర్కారు ఏం చేసిందో ఆ పార్టీ నేత‌లు చెప్పగలరా? అని టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. విశాఖలోని త‌మ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ఉత్తరాంధ్ర రక్షణ- చర్చా వేదిక’లో పాల్గొని అచ్చెన్నాయుడు మాట్లాడారు. నిజానికి అభివృద్ధి చేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అనుకుంటే ఈ ప్రాంతానికి ఏమైనా చేయొచ్చని అన్నారు.

అభివృద్ధి చేయలేకే జ‌గ‌న్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత‌ సమస్యలను ఈ ప్రాంత మంత్రులు జగన్‌ వద్ద ప్రస్తావించగలరా? అని అచ్చెన్నాయుడు నిల‌దీశారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌పై గతంలో ఆ పార్టీ నేత‌లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కరోనా సంక్షోభ‌ సమయంలో అదే ప్రజల ప్రాణాలు కాపాడిందని ఆయ‌న చెప్పారు.

More Telugu News