Andhra Pradesh: ఏపీలో రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 64,550 కరోనా పరీక్షలు
  • 1,557 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 255 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో 4 కేసులు
  • రాష్ట్రంలో 18 మరణాలు
AP Corona Details

ఏపీలో గడచిన 24 గంటల్లో 64,550 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,557 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 232, పశ్చిమ గోదావరి జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,213 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి 13,825 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,12,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,83,119 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,179 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News