Telangana: తెలంగాణలో మరో 325 మందికి కరోనా పాజిటివ్

  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 78,787 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 80 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 6,065 మందికి చికిత్స
Telangana corona details

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 78,787 కరోనా పరీక్షలు నిర్వహించగా, 325 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 424 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,119 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,47,185 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,065 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,869కి పెరిగింది.

More Telugu News