Mahesh Babu: 'గోవా' ఫైట్ గొప్పగా వచ్చిందట!

  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • 'గోవా' షెడ్యూల్ పూర్తి
  • త్వరలో మరో షెడ్యూల్ కి సన్నాహాలు
  • హైదరాబాద్ లోనే షూటింగ్
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

దుబాయ్ .. హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, రీసెంట్ గా 'గోవా' షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. 'గోవా'లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయనీ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

మహేశ్ కెరియర్లోనే బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ గా ఇది నిలుస్తుందని చెబుతున్నారు. త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఆ షెడ్యూల్ షూటింగు దాదాపు హైదరాబాద్ లోనే ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News