C-11: ఆ విమానంలో ప్రయాణించినది 640 మంది కాదు.. 823 మంది: ఎయిర్ మొబిలిటీ కమాండ్

  • కిక్కిరిసి ప్రయాణించిన సి-17 విమానం
  • ప్రయాణికుల ఒళ్లో కూర్చుని మరో 183 మంది ప్రయాణం
  • సి-17లో ఒకేసారి ఇంతమంది ప్రయాణం ఇదో రికార్డు
C17 Globmaster flight which carries 823 people

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పరమయ్యాక ఆ దేశం నుంచి బయటపడేందుకు వేలాదిమంది ఆఫ్ఘన్లు విమానాశ్రయానికి పరుగులు తీసిన ఫొటోలు, వీడియోలో ఇటీవల సోషల్ మీడియాను ముంచెత్తాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన కార్గో విమానం సి-17 గత ఆదివారం కిక్కిరిసిపోయి ప్రయాణించింది. ఈ విమానంలో ఏకంగా 640 మంది ప్రయాణించినట్టు వార్తలు వచ్చాయి. జనంతో విమానం కిక్కిరిసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాకెక్కాయి.

అయితే, నిజానికి ఈ విమానంలో ప్రయాణించినది 640 మంది కాదని, 823 మంది ప్రయాణించారని ఎయిర్ మొబిలిటీ కమాండ్ వెల్లడించింది. నిజానికి విమానంలో కూర్చున్న 640 మందినే లెక్కపెట్టామని, పెద్దల ఒళ్లో కూర్చుని మరో 183 మంది చిన్నారులు కూడా ప్రయాణించారని తాజాగా తెలిపింది. సి-17 విమానంలో ఒకేసారి ఇంతమంది ప్రయాణించడం ఇదో రికార్డని పేర్కొంది.

More Telugu News