Corona Virus: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • కొత్తగా 1,433 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 13,686
Corona cases in Andhra Pradesh increased again

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 68,041 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,433 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 216 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 16 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృత్యువాత పడగా... 1,815 మంది కోలుకున్నారు.
 
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 19,97,102కి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 19,67,472 మంది కోలుకున్నారు. 13,686 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News