USA: హృదయ విదారకం: కాబూల్ నుంచి వెళ్లిన అమెరికా విమానం చ‌క్రంలో మాన‌వ శ‌రీర భాగాలు!

  • ఇటీవ‌ల కాబూల్ నుంచి వెళ్లిన విమానం
  • విమానం రెక్క‌కింద న‌క్కి ప్ర‌యాణించిన కొంద‌రు
  • వారిలో చాలా మంది మార్గ‌మ‌ధ్యంలోనే మృతి
afghans die usa

ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల వ‌శ‌మైన నేప‌థ్యంలో ఆ దేశం నుంచి విదేశాల‌కు వెళ్లిపోవాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఇటీవ‌ల‌ కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా దళాలు ఓ విమానంలో ప్ర‌జ‌ల‌ను తరలిస్తుండ‌గా అందులో చాలా మంది ప్ర‌జ‌లు ఎక్కారు.

అది నిండిపోవ‌డంతో విమానం రెక్క‌కింద కూర్చొని ప్ర‌మాద‌క‌ర స్థితిలో ప్ర‌యాణించ‌డానికి కొందరు ప్ర‌య‌త్నించారు. వారిలో ముగ్గురు పౌరులు గాల్లోంచి జారిపడి మృతి చెందిన వీడియో ఇటీవ‌ల వైర‌ల్ అయింది. అయితే, ఆ ముగ్గురే కాకుండా రెక్క‌కింద కూర్చొని ప్ర‌యాణించిన వారిలో చాలా మంది ప్రాణాలు విడిచారు.

ఆ సైనిక విమానంపై ఎక్కిన కొంద‌రు చ‌క్రం భాగంలో న‌క్కి ప్ర‌యాణించాల‌నుకున్నారు. విమానం అమెరికాలో దిగిన త‌ర్వాత సిబ్బంది ప‌రిశీలించినప్పుడు చ‌క్రం భాగంలో మాన‌వ శ‌రీర‌భాగాలు క‌న‌ప‌డిన‌ట్లు అమెరికా వైమానిక ద‌ళం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. కాబూల్‌లో ఆ విమానంలోకి కొన్ని క్ష‌ణాల్లోనే వంద‌లాది మంది ఎక్కార‌ని వివ‌రించింది.

More Telugu News