హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థితో కలిసి బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు!
- శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ
- ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ మండలం శాలపల్లిలో కేసీఆర్ సభ
- అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలన
ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ మండలం శాలపల్లిలో కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ పరిశీలిస్తున్నారు. కాసేపట్లో అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ నేతలు నివాళులర్పించనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుంచి జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీతో ఇల్లందకుంటకు చేరుకుంటారు. అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వీణవంకలో జరగనున్న సభకు హాజరవుతారు.