Harish Rao: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థితో క‌లిసి బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హ‌రీశ్ రావు!

harish rao participates in bike rally
షార్ట్స్‌లో చూడండి
హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ కీల‌క నేత‌లు ఆ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించారు. ఈ రోజు మంత్రులు హ‌రీశ్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న‌ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను పార్టీ అభ్య‌ర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.  

ఈనెల 16వ తేదీన హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో కేసీఆర్‌ సభ ఉన్న‌ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ పరిశీలిస్తున్నారు. కాసేప‌ట్లో అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ నేత‌లు నివాళులర్పించనున్నారు. అనంత‌రం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్క‌డి నుంచి జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీతో ఇల్లందకుంటకు చేరుకుంటారు. అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత వీణవంకలో జ‌ర‌గ‌నున్న సభకు హాజ‌ర‌వుతారు.
Go Back to Shorts
Harish Rao
TRS
Huzurabad

More Telugu News