Raghu Rama Krishna Raju: ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణరాజు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. తన భేటీకి సంబంధించిన వివరాలను రఘురామ ట్వీట్ చేశారు. ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం సంతోషదాయకం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని రఘురామ వివరించారు. తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కలిసేందుకు అవకాశమిచ్చిన అమిత్ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.