Telangana: తెలంగాణలో కొత్తగా 582 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 1,07,329 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 83 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 8,744 మందికి చికిత్స
Telangana covid details bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,329 కరోనా పరీక్షలు నిర్వహించగా, 582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 83 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 61 కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 45 కేసులు గుర్తించారు. కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 638 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,47,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,35,250 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,744 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,817కి చేరింది.

More Telugu News