Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్.. రెజ్లింగ్‌లో క్వార్టర్స్‌కు రవికుమార్ దహియా

  • టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో శుభవార్త
  • కొలింబియా రెజ్లర్ ఆస్కార్‌ను 13-2తో చిత్తు చేసిన రవికుమార్
  • మరో రెజ్లర్ అన్షుమాలిక్ ఓటమి
Wrestler Ravi reaches quarters

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నేడు మరో గుడ్‌న్యూస్. రెజ్లర్ రవికుమార్ దహియా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కొలంబియాకు చెందిన ఆస్కార్ ఎడౌర్డోతో జరిగిన పోరులో 13-2తో విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో బల్గేరియాకు చెందిన జార్జి వాలెంటినోవ్‌తో తలపడతాడు. మరోవైపు, 57 కేజీల మహిళల ఓపెనింగ్ రౌండ్‌లో ఇండియన్ రెజ్లర్ అన్షు మాలిక్ బెలారస్‌కు చెందిన ఇరీనా కురచ్కినా చేతిలో 8-2తో ఓటమి పాలైంది. కాగా, అంతకుముందు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకున్నాడు.

More Telugu News