మా విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు: విజయసాయిరెడ్డి
- కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశం
- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చ
- పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయం రాజమండ్రికి తరలింపుపై కూడా
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 'విశ్వసనీయత పాతాళంలోకి జారిపోయాక, ఇక ప్రజల దగ్గర తన పప్పులు ఉడకవని డిసైడై పోయాడు బాబు. అందుకే ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాలుచేసే కుట్రలపై దృష్టి పెట్టాడు. ఈయన వాడకంలో మత్తు డాక్టర్ నుంచి నిమ్మగడ్డ దాకా ఎంతో మంది బలవుతూనే ఉన్నారు. నిండా మునిగినోడికి చలి ఏముంటుంది?' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.