Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీంలో భారత్‌కు నిరాశ

  • స్టేజ్-1లో అద్భుత ప్రదర్శనతో ఆశలు రేపిన సౌరభ్-మనుబాకర్ జోడి
  • స్టేజ్-2లో ఏడో స్థానంలో నిలిచిన వైనం
  • పతకం ఆశలు గల్లంతు
Tokyo Olympics indias manubaka and saurabh caudhary losses

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీంలో సౌరభ్ చౌదరి, మనుబాకర్ తీవ్రంగా నిరాశ పరిచారు. క్వాలిఫికేషన్ స్టేజ్-1లో అగ్రస్థానంలో నిలిచి పతకం ఆశలు రేపిన వీరిద్దరూ.. స్టేజ్-2లో రాణించలేకపోయారు. ఈ స్టేజిలో మొత్తం 8 జట్లు పాల్గొనగా, భారత జోడీ కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా తదుపరి మ్యాచ్‌లకు అర్హత సాధించలేకపోయింది.

More Telugu News