తెలంగాణలో మరో 647 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,20,213 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 81 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 9,625 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,40,659 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,27,254 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,625 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,780కి పెరిగింది.
