Revanth Reddy: మా స‌హ‌నాన్ని ప‌రీక్షించకూడ‌దు: రేవంత్ రెడ్డి

  • అరెస్టు చేసిన వారిని విడుద‌ల చేయాలి
  • పెట్రోలు, డీజిల్‌ ధరలపై ఆందోళన కొన‌సాగిస్తాం
  • అరెస్టులు, నిర్బంధాలు చేస్తే చూస్తూ ఊరుకోం
  • ల‌క్ష‌లాది మంది రోడ్డుపైకి వ‌చ్చి ఆందోళ‌న చేస్తారు
revanth reddy slams trs

పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుద‌ల‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో చేప‌డుతోన్న ఆందోళ‌న‌ల్లో భాగంగా ఈ రోజు ‘చలో రాజ్‌భవన్‌’కు వెళ్తున్న నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటున్న విష‌యం తెలిసిందే. దీనిపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. తాము శాంతియుతంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తామ‌ని, ధ‌ర్నాచౌక్ నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ఇలా ముంద‌స్తు అరెస్టులు, నిర్బంధాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమ‌ని చెప్పారు.

అరెస్టు చేసిన వారిని పోలీసులు వెంట‌నే విడిచిపెట్టాల‌ని ఆయ‌న అన్నారు. శాంతియుత నిర‌స‌న‌ల‌ను ఇలా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే ల‌క్ష‌లాది మంది రోడ్డుపైకి వ‌చ్చి ఆందోళ‌న నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎంత మందిని అరెస్టు చేయించిన‌ప్ప‌టికీ త‌మ నిర‌స‌న కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ప‌న్నుల‌ను పెంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోపిడీ చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కొట్లాడేందుకు తాము వెన‌కాడ‌బోమ‌ని చెప్పారు.

More Telugu News