Telangana: తెలంగాణలో కొత్తగా 710 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 1,10,355 కరోనా పరీక్షలు
  • ఖమ్మం జిల్లాలో 80 కొత్త కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
Telangana corona cases and mortality update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,10,355 కరోనా పరీక్షలు నిర్వహించగా, 710 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 80 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు గుర్తించారు. నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 808 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,34,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,20,757 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,101 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,747కి చేరింది.

More Telugu News