Bandi Sanjay: పాద‌యాత్ర‌పై బండి సంజ‌య్ కీల‌క భేటీ

  • హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఎల్లుండి నుంచి పాద‌యాత్ర‌
  • పాద‌యాత్ర రూట్‌మ్యాప్‌పై చ‌ర్చ
  • పాల్గొన్న‌ రాజాసింగ్, ర‌ఘునంద‌న్‌రావు, విజ‌య‌శాంతి, డీకే అరుణ
bandi sanjay slams trs

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఎల్లుండి నుంచి బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఇందుకు సిద్ధ‌మ‌య్యేందుకు ఈ రోజు బండి సంజ‌య్ అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు.

పాద‌యాత్ర రూట్‌మ్యాప్‌పై చ‌ర్చిస్తున్నారు. ఇందులో రాజాసింగ్, ర‌ఘునంద‌న్‌రావు, జితేందర్‌రెడ్డి, విజ‌య‌శాంతి, డీకే అరుణ‌, వివేక్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో హుజురాబాద్ నేత‌లు కూడా పాల్గొనే అవ‌కాశం ఉంది. హుజురాబాద్‌లో ఈటల రాజేంద‌ర్ గెలుపే ల‌క్ష్యంగా బండి సంజయ్ చేయ‌నున్న‌ పాదయాత్ర‌లో ప‌లువురు బీజేపీ నేత‌లు పాల్గొన‌నున్నారు.

More Telugu News