Pavan: మరోసారి పూరి .. పవన్ కాంబో సెట్ అవుతున్నట్టే!

  • పవన్ క్రేజ్ ను పెంచిన 'బద్రి'
  • పూరిని నిలబెట్టిన సినిమా 
  • పవన్ స్టైల్ ను మరిచిపోని యూత్ 
  • మూడో ప్రాజెక్టు దిశగా సన్నాహాలు  
Puri and Pavan combo for Third time

పవన్ కల్యాణ్ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు బలపడుతుండటం విశేషం. పవన్ కల్యాణ్ కోసం ఒక కొత్త కథను తయారు చేసుకున్న పూరి, రీసెంట్ గా ఆయనను కలిసి వినిపించాడట. కథ చాలా డిఫరెంట్ గా ఉండటంతో, వెంటనే పవన్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఈ సినిమాకి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

దర్శకుడిగా పూరి జగన్నాథ్ కెరియర్ మొదలైందే పవన్ సినిమాతో. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' .. యూత్ లో సృష్టించిన సంచలనం .. అలజడి అంతా ఇంతా కాదు. పవన్ బాడీ లాంగ్వేజ్ ను బయటికి తీసిన సినిమా ఇది. ఆ తరువాత మళ్లీ ఓ పుష్కర కాలానికి 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' చేశారు. కానీ అది ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మూడోసారి ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. హరీశ్ శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత, పవన్ చేసే ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు.

More Telugu News