TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. 20న రూ. 300 దర్శన కోటా టికెట్ల విడుదల

  • 20న ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి
  • టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు యాప్‌లోనూ అందుబాటులో టికెట్లు
  • రోజుకు 5 వేల టికెట్లు మాత్రమే జారీ
TTD to release Rs 300 tickets on 20th this month

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ఈ నెల 20న ఆగస్టు నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. 20న ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) తోపాటు ‘గోవిందా’ యాప్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

More Telugu News