Visakhapatnam: మళ్లీ పట్టాలెక్కుతున్న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్

  • ఈ నెల 15 నుంచి మళ్లీ సేవలు ప్రారంభం
  • సాయంత్రం 6.40 గంటలకు విశాఖలో బయలుదేరనున్న రైలు
  • తర్వాతి రోజు ఉదయం 7.25 గంటలకు కాచిగూడ రాక
Visakhapatnam Kachiguda Rail will resume services from 15th

విశాఖపట్టణం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ నెల 15 నుంచి ఈ రైలు సేవలు మళ్లీ ప్రారంభం కానున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ప్రయాణికుల నుంచి ఆదరణలేని కొన్ని రైళ్లను రైల్వే ఇటీవల రద్దు చేయగా, అందులో విశాఖపట్టణం-కాచిగూడ రైలు కూడా ఉంది. అయితే, ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు కుదుటపడి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో దానిని మళ్లీ పట్టాలెక్కిస్తోంది.

గురువారం సాయంత్రం 6.40 గంటలకు రైలు విశాఖలో బయలుదేరి శుక్రవారం ఉదయం 7.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 16న సాయంత్రం 6.25 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మల్కాజిగిరిలలో ఆగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

More Telugu News