8న షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన.. షెడ్యూల్ ఇదీ!
- పార్టీ వాల్పోస్టర్ ఆవిష్కరణ
- 8న బెంగళూరు నుంచి ఇడుపులపాయకు షర్మిల
- ప్రత్యేక చాపర్లో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేటకు
- పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు
పార్టీ ఆవిర్భావ ప్రకటనకు ముందు 8న షర్మిల బెంగళూరు నుంచి ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ తండ్రి వైఎస్సార్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం కడపకు చేరుకుని ప్రత్యేక చాపర్లో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట చేరుకుంటారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఫిల్మ్నగర్లోని సభావేదికకు చేరుకుని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారు.