Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

  • 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ
  • ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం
  • రూ. 864 కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గానికి నీటి సరఫరాకు గ్రీన్ సిగ్నల్
AP Cabenet takes key decisions

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
 
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే:

  • 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్. 
  • మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం.
  • ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం. 
  • విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని యూనివర్శిటీగా మార్చేందుకు ఆమోదం.
  • సత్యనారాయణపురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చాలని నిర్ణయం. విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.
  • టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5,990 కోట్ల బ్యాంకు గ్యారెంటీకి గ్రీన్ సిగ్నల్.
  • విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ కు ఎకరాకు రూ. 25 లక్షల చెప్పున 81 ఎకరాలను కేటాయించేందుకు అంగీకారం.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు రూ. 90 కోట్ల మంజూరు.
  • హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా రూ. 864 కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గానికి నీటి సరఫరాకు ఆమోదం.

More Telugu News