Manda Krishna Madiga: అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించి బీజేపీ తప్పు చేసింది: మంద కృష్ణ మాదిగ

  • అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం ముమ్మాటికీ తప్పే
  • ఇప్పుడు బీజేపీ ఎన్ని చెప్పినా దళిత సమాజం గుర్తించదు
  • భవిష్యత్తులోనూ బీజేపీ హాజరు కాదా?
Manda Krishna Madiga Writes Open Letter to BJP Chief Bandi Sanjay

దళితుల సాధికారతకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించడం ముమ్మాటికీ తప్పేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేఖ రాశారు. రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది దళితులకు సంబంధించిన అంశం కాబట్టి దాని గురించి మాట్లాడడానికి, ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టడానికి సమావేశానికి హాజరు కావడం బీజేపీ బాధ్యత అని మంద కృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇప్పుడు బీజేపీ ఎన్ని కారణాలు చెప్పినా దళిత సమాజం వాటిని గుర్తించదని అన్నారు.  అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదన్న బీజేపీ నిర్ణయం ఈ ఒక్క దానికే పరిమితమా? లేక భవిష్యత్తులో జరిగే అఖిలపక్ష సమావేశాలకూ ఇది వర్తిస్తుందా? అన్న విషయాన్ని బీజేపీ స్పష్టం చేయాలని మంద కృష్ణ మాదిగ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

More Telugu News