Andhra Pradesh: ఏపీలో కొత్తగా 4,250 పాజిటివ్ కేసుల నమోదు

  • గత 24 గంటల్లో 95,327 కరోనా టెస్టులు
  • తూర్పుగోదావరిలో 890 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 102 కేసులు
  • రాష్ట్రంలో 33 మంది మృతి
AP Covid Update

ఏపీలో గత 24 గంటల్లో 95,327 కరోనా టెస్టులు నిర్వహించగా 4,250 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 890 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 673 కేసులు గుర్తించారు. ఇతర జిల్లాల్లో 500కి లోపే తాజా కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 5,570 మంది కరోనా నుంచి కోలుకోగా, 33 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 8 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,79,872 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,22,500 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 44,773 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 12,599కి చేరింది.

More Telugu News