ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ
- అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు చేపడుతోందని ఆరోపణ
- ఎన్జీటీ స్టే ఇచ్చినా లెక్కచేయడంలేదని వెల్లడి
- ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి
- బోర్డుకు తగిన ఆధారాలు సమర్పించిన తెలంగాణ సర్కారు
ప్రాజెక్టు పనులకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తప్పనిసరి అని కేంద్రం కూడా ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఏపీ ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాలను పరిరక్షించాలని కోరింది. తన ఆరోపణల మేరకు తెలంగాణ ప్రభుత్వం తగిన ఆధారాలను కూడా సమర్పించింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కు లేఖ రాశారు.