MLC: ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ నూతన ఎమ్మెల్సీలు

  • గవర్నర్ కోటాలో నలుగురు కొత్త ఎమ్మెల్సీలు
  • ఇటీవల గవర్నర్ కు సిఫారసు చేసిన సీఎం జగన్
  • ఆమోదం తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
  • నేడు ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
YSRCP MLCs has taken oath

వైసీపీ నూతన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్, తోట త్రిమూర్తులు ఇవాళ ఏపీ శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ఈ నలుగురి పేర్లను సీఎం జగన్ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ కు సిఫారసు చేయగా, ఆయన గవర్నరు కోటాలో ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో, నేడు మండలిలో జరిగిన ఓ కార్య్రమంలో ఆ నలుగురు కొత్త ఎమ్మెల్సీలతో ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ఉదయం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వైసీపీ మంత్రులు, పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. లాంఛనాలు పూర్తయిన పిదప కార్యక్రమం ముగించారు.

More Telugu News