Anandaiah: ఎమ్మెల్యే కాకానితో కలిసి కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య

  • ఆనందయ్య కరోనా మందుకు అనుమతులు
  • ఇంటికి వచ్చిన ఆనందయ్య
  • ఆనందయ్యను తోడ్కొని వచ్చిన ఎమ్మెల్యే కాకాని
  • అధికారులతో మాట్లాడి పంపిణీ తేదీ ప్రకటిస్తానన్న ఆనందయ్య
Anandaiah arrives Krishnapatnam

ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం, హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆనందయ్య తన స్వస్థలం కృష్ణపట్నం చేరుకున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కృష్ణపట్నానికి వచ్చిన ఆయనకు స్థానికులు దిష్టి తీశారు. అనంతరం తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులతో చర్చించిన మీదట మందు పంపిణీ ప్రారంభిస్తానని, త్వరలోనే తేదీ ప్రకటిస్తానని వెల్లడించారు.

మొదట ఔషధానికి అవసరమయ్యే వనమూలికలు సమకూర్చుకోవాల్సి ఉందని, ఆపై ఔషధం తయారీకి 3 రోజుల సమయం పడుతుందని ఆనందయ్య వివరించారు. ఎమ్మెల్యే కాకాని సర్వేపల్లి నియోజకవర్గంలో అందరికీ మందు ఇవ్వాలని కోరారని, ముందు ఆ పని చూస్తానని ఆనందయ్య తెలిపారు.

More Telugu News