Pavan Kalyan: 'వీరమల్లు' సెట్లోకి అడుగుపెట్టనున్న పవన్!

  • చారిత్రక నేపథ్యంలో 'వీరమల్లు'
  • మొఘల్ కాలంలో నడిచే కథ
  • ఆశ్చర్యచకితులను చేసే భారీ సెట్లు
  • 'సంక్రాంతి'కి రిలీజ్ చేసే ఆలోచన  
Hari Hara Veeramallu next schedule will start soon

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' .. 'మణికర్ణిక' వంటి సినిమాలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇక చారిత్రక చిత్రం చేయడం .. ఈ స్థాయి బడ్జెట్లో చేయడం పవన్ కి ఇదే మొదటిసారి. అందువలన ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ఎ.ఎమ్.రత్నం మాట్లాడుతూ .. "ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఈ సినిమా షూటింగ్ కొనసాగింది .. ఆ తరువాత కరోనా ఉద్ధృతి కారణంగా ఆగిపోయింది. తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. సెట్లో అడుగుపెట్టడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. ఈ షెడ్యూల్లో జాక్విలిన్ .. అర్జున్ రాంపాల్ కూడా పాల్గొంటారు. రాజీవన్ డిజైన్ చేసిన మొఘల్ కాలంనాటి సెట్లు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము" అని చెప్పుకొచ్చారు.

More Telugu News