Chiranjeevi: కోకాపేటలో 'ఆచార్య' చివరి షెడ్యూల్ ప్లానింగ్!

  • ముగింపు దశలో 'ఆచార్య'
  • మిగిలి ఉన్న 20 రోజుల షూటింగ్
  • జులైలో షూటింగ్.. దసరాకి విడుదల  
Acharya movie shooting update

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఈ 'ఆచార్య' పాఠాలు కాదు .. గుణపాఠాలు చెబుతాడని అంటూ ఆ పాత్ర స్వభావాన్ని కొరటాల ముందుగానే చెప్పేశారు. చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమా షూటింగు ఇంకా 20 రోజుల పాటు జరగవలసిన సమయంలో, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది.

అప్పటి నుంచి కూడా ఆ కాస్త షూటింగు పూర్తి చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. 'కోకాపేట'లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 20 రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిరంజీవి .. చరణ్ .. సోనూ సూద్ కాంబినేషన్లో సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. ఆ సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. జులైలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసి, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ కి వెళ్లనున్నారని అంటున్నారు.

More Telugu News