బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారిన 'యాస్'
- బంగాళాఖాతంలో యాస్ తుపాను
- ఈ సాయంత్రం తీవ్ర తుపానుగా మారిన వైనం
- కొన్ని గంటల్లో మరింత బలపడిన యాస్
- ఒడిశా, బెంగాల్ తీరాల దిశగా పయనం
- రేపు మధ్యాహ్నం తీరం దాటనున్న తుపాను
తీరం చేరే సమయంలోనూ యాస్ అతి తీవ్ర తుపాను స్థాయిలోనే ఉంటుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 165 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.