Prabhas: 'రాధే శ్యామ్' రీ షూట్ల ముచ్చట!

  • పూర్వజన్మల నేపథ్యంలో ప్రేమకథ
  • గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఎక్కువ
  • రీ షూట్లు చెప్పిన ప్రభాస్  
Graphics works are pending in Radhe Shyam

ప్రభాస్ అభిమానులంతా 'రాధేశ్యామ్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీన థియేటర్లకు వస్తుందా .. లేదా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తుతోంది. అందుకు కారణం ఈ సినిమా గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదనే వార్తలు వస్తుండటమే! ముందుగా ప్లాన్ చేసుకున్న దానికంటే ఎక్కువ గ్రాఫిక్స్ అవసరం పడటమే ఇందుకు కారణమని అంటున్నారు.

ఇది పూర్వజన్మలతో ముడిపడిన ప్రేమకథ .. కథ చాలావరకూ విదేశాల్లోనే కొనసాగుతుంది. ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలనే ప్రయత్నం కారణంగానే గ్రాఫిక్స్ వైపు వెళ్లారు. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని ప్రభాస్ చెప్పాడట. దాంతో ఆ దిశగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తరువాత రీ షూట్ పెట్టుకుంటారనే మాట వినిపిస్తోంది. దాంతో ముందుగా చెప్పిన సమయానికి ఈ సినిమా థియేటర్స్ కి వస్తుందా లేదా? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

More Telugu News