Corona Virus: జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,225 మందికి క‌రోనా నిర్ధార‌ణ‌

  • తెలంగాణ‌లో కొత్త‌గా 6,361 మందికి కరోనా
  • నిన్న‌ 51 మంది మృతి
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722
  • మొత్తం మృతుల సంఖ్య 2,527
   Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,361 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,527 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,89,491 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,527గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,704 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,225 మందికి క‌రోనా సోకింది.

     

More Telugu News