MBBS: నెల్లూరులో ఓ అపార్టుమెంటులో ఎంబీబీఎస్ పరీక్షలు... అడ్డంగా దొరికిపోయిన ప్రొఫెసర్లు, విద్యార్థులు

  • ఎక్కడ చూసినా కరోనా కల్లోలం
  • ఇదే అదనుగా అక్రమ పరీక్షల వ్యవహారం
  • దొంగచాటుగా అపార్టుమెంటులో పరీక్షలు
  • ఇద్దరు ప్రొఫెసర్లు, 9 మంది విద్యార్థుల అరెస్ట్
MBBS exams being conducted in a apartment

యావత్ ప్రభుత్వ యంత్రాంగం కరోనా పనులతో బిజీగా ఉన్నవేళ తమ అక్రమ వ్యవహారం ఎవరికీ తెలియదనుకున్నారో ఏమో కానీ... ఎంబీబీఎస్ పరీక్షలను ఓ అపార్టుమెంటులో నిర్వహిస్తూ కొందరు ప్రొఫెసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నెల్లూరులో ఈ ఘటన జరిగింది. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ప్రొఫెసర్లు ఓ అపార్టుమెంటులో దొంగచాటుగా రాయించిన వైనం బట్టబయలైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రొఫెసర్లతో పాటు 9 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News