Telangana: తెలంగాణలో నేటితో ముగియనున్న కర్ఫ్యూ.. మరికొన్ని రోజులు పొడిగించే యోచనలో ప్రభుత్వం

  • ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ
  • తగ్గుముఖం పట్టని కేసులు
  • పొడిగింపుపై నేడు ప్రకటన!
Night curfew will continue in Telangana

ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులపాటు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నెల 20న విధించిన నైట్‌ కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ పొడిగింపుపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణలో మరో రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టివేసింది.

More Telugu News