Corona Virus: దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం.. కొత్త‌గా 3,32,730 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695
  • నిన్న‌ 2,263 మంది కరోనా కారణంగా మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 1,86,920  
  • మొత్తం 27,44,45,653 కరోనా పరీక్షలు
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో క‌రోనా ఉద్ధృతి మామూలుగా లేదు. నిన్న‌ కొత్త‌గా 3,32,730 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,93,279 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,263 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,86,920కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,36,48,159  మంది కోలుకున్నారు. 24,28,616 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,54,78,420 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 27,44,45,653 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,40,550 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News