తిరుపతిలో దొంగ ఓట్ల కలకలంపై స్పందించిన ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్
- తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్
- తిరుపతిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని విపక్షాల ఆరోపణ
- మీడియాలో వార్తలు ప్రసారం
- కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షించిన విజయానంద్
ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే... భారీగా బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయానంద్ స్పందించారు. సెక్రటేరియట్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి తిరుపతి పోలింగ్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు.