తృణమూల్ సొంత సర్వేలోనూ బీజేపీదే విజయం: ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ లీక్!
- మమతా బెనర్జీతో చాటింగ్ బట్టబయలు
- తన మాటలను ఎడిట్ చేశారన్న ప్రశాంత్ కిశోర్
- మొత్తం చాటింగ్ ను విడుదల చేయాలని డిమాండ్
బెంగాల్ లో అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దళితులతో పాటు తప్పిలి, మాతురా వర్గాలు కూడా బీజేపీ వైపు నిలిచారని అమిత్ వ్యాఖ్యానించారు. తన ఆడియో లీక్ అవుతుందన్న సంగతి ప్రశాంత్ కిశోర్ కు తెలియదని, దాదాపు రెండు దశాబ్దాల తరువాత ముస్లింలు టీఎంసీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలకు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.
ఇక ఈ లీక్ లపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన క్లబ్ హౌస్ చాట్ లో కొంత భాగాన్ని మాత్రమే వారు తీసుకుని, ఎడిట్ చేసి విడుదల చేశారని, మొత్తం తమ సంభాషణ ఏంటన్న విషయాన్ని వారు విడుదల చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీన్ని 45 వేల మంది రీ ట్వీట్ చేయగా, ఆపై ప్రశాంత్ చేసిన ట్వీట్ కు 11 వేల రీట్వీట్లు వచ్చాయి.