ఏపీ సీఎం జగన్ ను కలిసిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు
- ఇటీవలే టీడీపీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు
- మరోసారి బాధ్యతలు అందుకున్న వైనం
- సీఎం జగన్ కు కృతజ్ఞతలు
- సీఎంను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు
- ధర్మాన్ని రక్షిస్తున్నారని కితాబు
ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ ను మహావిష్ణువుతో పోల్చారు. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరామని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడంలేదని, దేవస్థానం విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు.