తూచ్.. భారత్ నుంచి చక్కెర, పత్తి దిగుమతిపై పాక్ యూటర్న్
- ఒక్క రోజులోనే మాట మార్చిన పాకిస్థాన్
- కమిటీ సూచనలను తోసిపుచ్చిన ఇమ్రాన్ కేబినెట్
- కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే వాణిజ్యమన్న మంత్రి
పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్.. భారత్ నుంచి పత్తి, పంచదారను దిగుమతి చేసుకోవాలన్న ఎకనమిక్ కో ఆర్డినేషన్ కమిటీ సూచనలను తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్కు మునుపటిలా మళ్లీ స్వయంప్రతిపత్తి కల్పిస్తేనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగుతుందని, లేదంటే లేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెగేసి చెప్పారు.