ఏపీ, తెలంగాణలో వడగాడ్పులు... వాతావరణ శాఖ హెచ్చరిక
- తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
- ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు
- రానున్న మూడ్రోజులు వడగాడ్పులు
- ఏపీలో నాలుగు జిల్లాలకు హెచ్చరికలు
- తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పెరిగే అవకాశం
అటు, తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రాష్ట్రంలో ఉత్తర దిక్కు నుంచి వేడిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు తప్పవని, ఈ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలో ఉండడం శ్రేయస్కరం అని, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అధిక వేడిమి ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో వీలైనంత వరకు బయటికి రావొద్దని పేర్కొంది.