SEC: తదుపరి ఎస్ఈసీ నియామకం కోసం ముగ్గురి పేర్లను గవర్నర్ కు పంపిన ఏపీ ప్రభుత్వం?

  • ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ
  • కొత్త ఎస్ఈసీ నియామకంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
  • నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను పంపిన సర్కార్
YSRCP govt sent 3 names for next SEC selection

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో, తదుపరి ఎస్ఈసీ ఎవరనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ప్రభుత్వం పంపింది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ ఉన్నారని సమాచారం.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఏమాత్రం లేదు. కొత్తగా బాధ్యతలను చేపట్టే ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News