Errabelli: అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచాం: తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి

  • మాకు ప్రజల మద్దతు ఉంది
  • బీజేపీ, కాంగ్రెస్‌ నేత‌లు ఏది ప‌డితే అది మాట్లాడారు
  • ఇప్ప‌టికైనా మానుకోవాలి
  • కేంద్రం చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించారు
errabelli slams bjp congress

కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే వారికి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు తగిన బుద్ధి చెప్పారని తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. తెలంగాణ‌లోని రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స్థానాల్లో త‌మ పార్టీ గెలుపొందిన నేప‌థ్యంలో ఆయ‌న వరంగ‌ల్‌లో మీడియాతో మాట్లాడుతూ ..  త‌మ‌కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ సంపూర్ణ మెజారిటీతో గెలిచింద‌ని చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేత‌లు ఏది ప‌డితే అది మాట్లాడ‌డాన్ని ఇప్ప‌టికైనా మానుకోవాలని ఎర్ర‌బెల్లి అన్నారు. ఇప్పుడు బీజేపీకి శాస‌న మండ‌లిలో  స్థానం లేకుండా పోయిందని చెప్పారు. త‌మ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేయించి లబ్ధి పొందాలని టీఆర్ఎస్ నేత‌లు చూశారని ఆయ‌న అన్నారు.

అలాగే, తెలంగాణ‌కు  కేంద్ర ప్ర‌భుత్వం చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించారని ఆయ‌న చెప్పారు.   స్వతంత్ర అభ్య‌ర్థుల‌కు ఇచ్చినంత‌ ప్రాధాన్యత కూడా బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌కు ప్ర‌జ‌లు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు బీజేపీని చిత్తుగా ఓడిస్తార‌ని చెప్పారు.


More Telugu News