yash: గూండాల‌ను పిలిపించి హీరో య‌శ్ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు: క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు

  • క‌ర్ణాట‌క‌లోని హాసన్‌ జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసిన రాజ్య రైతు సంఘం
  • తిమ్మాపుర గ్రామంలో య‌శ్ కుటుంబం భూమి కొనుగోలు
  • పొలాల‌కు వెళ్లే దారి వ‌ద‌ల‌కుండా ప్ర‌హారీ గోడ‌
  • మండిప‌డుతోన్న గ్రామ‌స్థులు
compalint against yash

'కేజీఎఫ్' సినిమా హీరో యశ్ తమ‌ను బెదిరింపుల‌కు గురి చేస్తున్నాడంటూ క‌ర్ణాట‌క‌లోని హాసన్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. క‌లెక్ట‌ర్‌కు రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు. యశ్‌ తల్లిదండ్రులు దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో  ప్రహరీ నిర్మాణాలు జ‌రిగాయ‌ని ఆయ‌న తెలిపారు.

ఈ నేప‌థ్యంలో అభ్యంత‌రాలు తెలుపుతోన్న‌ రైతులను ఇబ్బంది పెట్టార‌ని, గూండాలను పిలిపించి గ్రామస్థులను యశ్‌ భయపెడుతున్నాడ‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ ఫిర్యాదును స్వీక‌రించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ భూమిలో నిర్మాణాల‌పై యశ్‌ తల్లికి, గ్రామస్థులకి మధ్య ఇటీవ‌ల‌ గొడవ చెల‌రేగింది.

 తిమ్మాపుర గ్రామంలో య‌శ్ కుటుంబం తాజాగా 80 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ప్ర‌హారీ గోడ క‌ట్టి తమ పొలాలకు దారిని మూసివేశారని య‌శ్ కుటుంబ సభ్యుల‌తో గ్రామ‌స్థులు గొడ‌వ‌కు దిగారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై పోలీసు స్టేష‌న్ లోనూ గ్రామ‌స్థులు ఫిర్యాదు చేశారు.


More Telugu News